Header Ads

  • Breaking News

    సాయిధరమ్ తేజ్, రకుల్ సినిమా ప్రారంభోత్సవం


    సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు శ్రీనువైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.

    ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జూన్ 10 నుంచి మొదలుపెడుతున్నారు. యూనిట్ అంతా ఇప్పుడు అందుకు సంబంధించిన సన్నాహాలను ఆరంభించే పనుల్లో వున్నారు. 'పండగ చేస్కో' తరువాత గోపీచంద్ మలినేని చేస్తోన్న సినిమా ఇది. ఇక సాయిధరమ్ తేజ్ నటించిన 'సుప్రీమ్' మే 5న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఆయన మరో సినిమా 'తిక్క' సెట్స్ పై వుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్ తో కలిసి నటించిన రకుల్, ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ తో జోడీ కట్టడం విశేషం

    No comments

    Post Top Ad

    Post Bottom Ad